పెనుకొండ: తల్లికి వందనం అమలుపై సీఎంకు మంత్రి సవిత ధన్యవాదాలు

54చూసినవారు
పెనుకొండ: తల్లికి వందనం అమలుపై సీఎంకు మంత్రి సవిత ధన్యవాదాలు
సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకం అమలుచేయడంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి ఎస్. సవిత కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్ ను మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి నారా లోకేశ్ కు సవిత శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్