బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా సావిత్రి బాయి పోరాటం చేశారంటూ మంత్రి సవిత కొనియాడారు. శనివారం గుంటూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రి బాయి జయంత్యోత్సవంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం సావిత్రి బాయి చేసిన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు.