మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడిన మాటలపై టీడీపీ నాయకులు శనివారం కౌంటర్ ఇచ్చారు. పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టౌన్ కన్వీనర్ శ్రీరాములు, సోమందేపల్లి మండల కన్వీనర్ సిద్దలింగప్ప, రమణమ్మ, బిజెపి నాయకులు రామకృష్ణలు మాట్లాడుతూ బిసి సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాల గురించి మాజీ మంత్రి ఉషశ్రీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.