దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయిక్ వీరమరణం దేశానికి గర్వకారణమని అతని తల్లిదండ్రులను గ్రామానికి వెళ్లి ఓదార్చి అనంతరం నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ రత్న. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అతని వీరమరణం యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు. అయన పేరు భారతీయ చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. ప్రభుత్వ లాంచనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.