భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విన్నవించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనీవా సుజల స్రవంతి పనుల పరిశీలన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం సత్యసాయి విమానాశ్రయంనికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.