భారత్ జరుపుతోన్న ఆపరేషన్ సిందూర్ లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎప్పుడూ మర్చిపోదన్నారు. జమ్మూ సరిహద్దులో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరని భగవంతున్ని ప్రార్థిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్. జవాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.