సోమందేపల్లి: జవాన్ మురళి నాయక్ కు పాఠశాలలో ఘన నివాళి

78చూసినవారు
దేశ రక్షణలో శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా కి చెందిన మురళి నాయక్ యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సోమందేపల్లి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్నట్లు, పాఠశాలలో చదువులో ఆటపాటలలో మంచి ఆక్టివ్ గా ఉండేవాడని కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. పాఠశాల నందు మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసిన కరస్పాండెంట్ తోటి మిత్రులు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. జోహార్ మురళి నాయక్ , మురళి నాయక్ అమరహే అంటూ నినాదాలు చేసి మౌనం పాటించారు. జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. గడ్డం పల్లి తండా కు పాఠశాల యాజమాన్యం, తోటి మిత్రులు తరలి వెళ్లారు.
Where: సోమందేపల్లి

సంబంధిత పోస్ట్