పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని 10 గ్రామాల రైతులకు స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద గురువారం టీడీపీ నాయకులు వేరుశనగ విత్తన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించిన వేరుశనగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, టౌన్ కన్వీనర్ సురేష్ మాగే, చెరువు సర్పంచ్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.