సత్యసాయి జిల్లాలోని పలు గ్రామాల్లో రేపు ( మంగళవారం) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సోమవారం ఏడీఈ శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సోమందేపల్లి మండలంలోని మండ్లి, ముద్దపుకుంట, కొల్లకుంట గ్రామాలలో రేపు, ఎల్లుండి విద్యుత్ సరఫరా ఉండదన్నారు. 220 కెబి విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా ఈ మూడు గ్రామాలలో మంగళవారం, బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు.