గోరంట్ల మండలం గడ్డం తండాకి చెందిన మురళి నాయక్ యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సోమందేపల్లి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల యాజమాన్యం తెలిపారు. పాఠశాలలో మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసిన కరస్పాండెంట్ తోటి మిత్రులు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. జోహార్ మురళి నాయక్, మురళి నాయక్ అమరహే అంటూ నినాదాలు చేసి మౌనం పాటించి ర్యాలీ నిర్వహించారు.