పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో గొల్లపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న హంద్రీ నీవా కాలువకు గురువారం గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. ఈ విషయం తెలుసుకున్న సోమందేపల్లి ఎస్సై రమేష్ బాబు కాలువ తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గండి పడిన కాలువను వెంటనే మరమ్మతులు చేసి వృధా నీటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.