ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సవితమ్మ కి బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనకబడిన వారి సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్ శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి సవితమ్మ స్వగృహంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు.