హిందూపురంలో జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళులు

53చూసినవారు
హిందూపురంలో జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళులు
హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్ నుండి సద్భావన సర్కిల్ వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వీర మరణం పొందిన  మురళి నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేశారు. అనంతరం చిత్రపటానికి నివాళులులు అర్పించారు. మునిసిపల్ చైర్మన్ రమేష్ కుమార్, అంజినప్ప మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ కుంటుంబానికి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్