సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్ లో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే బయటకు పంపుతామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చోళ సముద్రం, ములుగురు కౌంటింగ్ హాల్ లో దాదాపు 4, 000 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు మూడు టేబుల్స్ అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.