కళాజాత బృందాలతో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు

76చూసినవారు
కళాజాత బృందాలతో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై  అవగాహన కార్యక్రమాలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కళాజాత బృందాల తో హెచ్. ఐ. వి/ఎయిడ్స్ పై వీధి నాటకముల ద్వారా అవగాహన కార్యక్రమాలు మే 8 నుండి 29 వరకు నిర్వహించనున్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో రెండు కళాజాత బృందాలతో హెచ్. ఐ. వి/ఎయిడ్స్, సుఖవ్యాధులు, రక్తదానం, హెచ్. ఐ. వి యాక్ట్ 2017 పై ప్రజలకు వీధి నాటకాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్