కోడికొండ చెక్పోస్ట్ వద్ద మే 18న మహారాష్ట్ర మంత్రి శ్రీ సంజయ్ రాథోడ్కు ఉత్సాహభరితంగా స్వాగతం కల్పించారు. వీరజవాన్ మురళినాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తుండగా, బాగేపల్లి టోల్ప్లాజా వద్ద ఏబీబీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు అంజినాయక్, ఉపాధ్యక్షుడు లాయర్ విశ్వనాథ్ నాయక్ పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి గారి కాన్వాయ్ కల్లితాండా గ్రామానికి బయలుదేరింది.