ఓబులదేవరచెరువు మండల కేంద్రంలో డిటిఎఫ్ కార్యాలయంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కట్టుబడి గౌస్ లాజమ్ శుక్రవారం మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడైన మురళి నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు ఉన్న జిల్లాలో మనము కూడా ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అతని కుటుంబ సభ్యులకు యావత్ భారతదేశం రుణపడి ఉంటుందని తెలిపారు.