
పాక్ దుశ్చర్య.. మరోసారి డ్రోన్ అటాక్
భారత్లోని 26 చోట్ల పాకిస్థాన్ శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడి చేయగా.. తాజాగా మరోసారి దుశ్చర్యకు దిగింది. శనివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆర్మ్డ్ డ్రోన్లతో దాడికి దిగింది. భారత సైన్యం దాడికి ముందే పసిగట్టి ఆయా ప్రాంతాలను పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించింది. పాక్ దాడిని తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది.