ఓబుళదేవరచెరువు మండలంలోని కొండకమర్ల పాఠశాల యందు జెవివి ఆధ్వర్యంలో శుక్రవారం 195వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, హెచ్. ఎం నాగరాజు మాట్లాడుతూ భారత దేశ సంఘసంస్కర్తలలో సావిత్రిబాయి పూలే అగ్రగణ్యురాలని కొనియాడారు.