డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఓడిసిలోని అంబేద్కర్ సర్కిల్ లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.