పుట్టపర్తి ఎయిర్ పోర్టు వద్ద సీఎం చంద్రబాబుకు మంత్రులు టీజీ భరత్, సవిత, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చాయాపురం వద్ద హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వెడల్పు పనుల ప్రారంభోత్సవానికి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు.