ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, పర్యటనను విజయవంతం చేయాలని పుట్టపర్తి టిడిపి ఇన్చార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణాన్ని ఆయన జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు అందించారు.