రామగిరి మండలంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇప్పటివరకు 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. మంగళవారం పుట్టపర్తిలో డీఎస్పీ హేమంత్కుమార్తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల ఏడుగురిని, ఇందులో బుడిద రాజేశ్ తదితరులు, ఒక మైనర్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసును సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి రాజకీయ ప్రభావం లేదన్నారు.