మండలంలోని బలిజ పల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం సరస్వతి దేవి పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా సరస్వతి దేవిని పూలమాలలతో అలంకరించి పురోహితులు వేద మంత్రాల నడుము పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు కట్టుబడి గౌస్ లాజమ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మీ తల్లిదండ్రులకు మరియు మీకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలని తెలిపారు