పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, టీడీపీ మాల మహానాడు యువత కార్యదర్శి మనోహర్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.