మండల కేంద్రంలోనీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా - పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( డిటిఎఫ్ ) జిల్లా అధ్యక్షులు కట్టుబడి గౌస్ లాజమ్ ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోని ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు సురక్షితంగా ఉన్నారంటే సైనికులు యొక్క పుణ్యమే. సైనికులు అందరికీ భారత దేశ ప్రజలు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారని శుక్రవారం తెలియజేశారు.