ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు చేసిన దీక్షలు నేటితో ముగిసినట్లు ఆర్టీసీ యూనియన్ రీజనల్ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శనివారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు నిన్న ఈరోజు ధర్నా చేపట్టినట్లు తెలిపారు.