రాప్తాడు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా సానే ఉమారాణిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి గురువారం నియమించారు. అనంతరం సానే ఉమారాణి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాప్తాడు నియోజవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించారని తెలిపారు. గతంలో తన తండ్రి, తన అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలుపొందారని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.