గోరెంట్ల: జవాన్ కుటుంబాన్ని ఓదార్చిన పరిటాల సునీత, శ్రీరామ్

63చూసినవారు
గోరెంట్ల: జవాన్ కుటుంబాన్ని ఓదార్చిన పరిటాల సునీత, శ్రీరామ్
యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. శనివారం సాయంత్రం కల్లితాండాకు వెళ్లి జవాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడ గుండెలు పగిలేలా రోదిస్తున్న అయన తల్లిదండ్రులను వారు ఓదార్చారు. తల్లి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండగా తండ్రితో మాట్లాడారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి 2 లక్షల రూపాయల సాయం అందజేశారు. మురళీ నాయక్ తన మరణంతో దేశానికే కీర్తి తెచ్చాడని ధైర్య సాహాసాల గురించి అంతా చెప్పుకునే స్థాయికి వెళ్లాడన్నారు. ఒక సైనికుడికి ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా వీరమరణం కంటే గొప్ప అవార్డు లేదన్నారు.

సంబంధిత పోస్ట్