రాజకీయంగా మేము ఏ కార్యక్రమం తలపెట్టినా, విజయాలు చూసినా అది ముత్తవకుంట్ల నుంచే ప్రారంభమవుతుందని రాప్తాడు ఎమ్మెల్యే సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి శ్రీరామ్ అన్నారు. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. వీరికి గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఇందులో 60 లక్షల రూపాయలు దేవాదాయశాఖ నిధులు, మరో 15 లక్షలు దాతలు అందించారు.
.