రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం రామగిరి రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.