టీటీడీ ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చేసిన ఆరోపణలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడారు కరుణాకర్ రెడ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, అసలు ఆయనకు ఈసమాచారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు.