అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కురుబ నారాయణ స్వామి కుమార్తె రేణుక రెండు రోజులక్రితం బలవన్మరణం చెందారు. బుధవారం ఎమ్మెల్యే పరిటాల సునీత పూలకుంట గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.