చెన్నై కొత్తపల్లి మండల కేంద్రం సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగమ్మ అనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సింగనమల మండలం నార్పలకి చెందిన ఈశ్వరయ్య భార్య గంగమ్మ కుమారుడు మంజునాథతో కలిసి శుక్రవారం నార్పల గ్రామం నుండి హిందూపురంకు బైక్ పై వస్తుండగా నాగసముద్రం గేటు సమీపానికి రాగానే బైక్ అదుపుతప్పి కిందపడగా.. గంగమ్మ తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందింది.