రాయదుర్గం మండల పరిధిలోని మలకలమూర్ బార్డర్ చెక్ పోస్టులను డిఎస్పి శ్రీనివాసులు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక అక్రమ మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలని డి. ఎస్. పి సిబ్బందిని ఆదేశించారు. అక్రమ మద్యం, డబ్బు ఎవరు తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు వాహనాలను ఆపి ముమ్మర తనిఖీలు చేపట్టారు.