భక్తి శ్రద్ధలతో ఘనంగా బసవేశ్వరుడి జయంతి వేడుకలు

79చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం బసవ జయంతి సందర్భంగా పురోహితులు మంజునాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత, కుంకుమార్చనలు చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి నేడు స్వామి వారిని దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి అన్నారు. ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఈ నెల 19వ తేదీన వైభవంగా జయంతి వేడుకలు మరోసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్