రాయదుర్గం పట్టణంలోని మూడవ వార్డులో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. టిడిపి వార్డు కౌన్సిలర్ ప్రశాంతి తమ వార్డులోని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేపట్టారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా ఒకేసారి పెన్షన్ పెంపును చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లు విరబూసిందన్నారు. వెల్ఫేర్ సెక్రెటరీ పాల్గొన్నారు.