కొత్తచెరువు మండలంలో ఉన్న నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలల ముందు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్ లు నిర్వహిస్తున్నాయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఎల్కేజి, యూకేజీ కి అనుమతి లేకపోయినా వేల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు.