రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం ఆంధ్ర సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద తుంగభద్ర జలాలకు బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గంగపూజ నిర్వహించి స్వాగతం పలికారు. గత వైసిపి పాలనలో మరమ్మత్తుల పనులు చేయకుండా తుంగభద్ర ఎగువ కాలువను అనాధగా మార్చారని కాల్వ విమర్శించారు. అధికంగా నీరు విడుదలకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకే తాగునీరు, సాగునీరు అందిస్తూ వరదాయినిగా నిలుస్తోందన్నారు.