రాయదుర్గం పట్టణంలో నారాయణ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా షూ, బెల్ట్, టై యూనిఫామ్ విక్రయిస్తుండడంతో నిన్నటి దినం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు అడ్డుకొని ఎంఈఓ కు సమాచారం అందజేశారు. బుధవారం ఎంఈఓ నాగమణి ఆర్ ఎస్ యు విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో రూమును సీజ్ చేసినట్లు మీడియాకి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్ ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేసాడు.