టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం కణేకల్లులో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబే మరో 15ఏళ్లు కొనసాగుతారని తెలిపారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే అధికారంలోకి వచ్చామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు.