రాయదుర్గం పట్టణంలోని సరస్వతి విద్య మందిరంలో మాఘశుద్ధ పంచమి సరస్వతి మాత ఆవిర్భవించిన పర్వదిన సందర్భంగా సోమవారం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు అధ్యక్షులు ధనార్జన, పాఠశాల కార్యదర్శి తుకారం, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.