కణేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో కౌలు రైతు తిప్పేస్వామి సాగుచేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. తిప్పేస్వామి 5ఎకరాల పొలంను కౌలుకి తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోతకు వచ్చే సమయంలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పొలం పక్కన ఉన్న కంప చెట్లకు, గడ్డికి నిప్పు పెట్టడంతో పంట పూర్తిగా కాలిపోయిందన్నారు. దీంతో సుమారు రూ. 4లక్షలు ఆస్తి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.