కణేకల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ ఛార్జి ఆనంద్ రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చాంద్ బాషా చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. మండలానికి 2, 100 క్వింటాళ్లు మంజూరు అయ్యాయని అధికారులు తెలిపారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.