రాయదుర్గం నియోజవర్గం పరిధిలోని బత్తలపల్లి గ్రామం వద్ద కొత్తగా నిర్మించిన హైవే బైపాస్ రోడ్డుపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం నుండి దైవదర్శనం తిరుపతికి వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8మందిలో అక్కడకక్కడే ఇద్దరు మృతి చెందగా మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను బత్తలపల్లి ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.