డి. హిరేహాల్ మండలం హర్దేహాల్ గ్రామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ పగిలి బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు తీవ్రగాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి బళ్లారి సమీపంలో ఉన్న గ్రామానికి వివాహ వేడుకలు నిమిత్తం సుమారు 70మంది బస్సులో వెళ్తుండగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో వెనుక టైరు పైభాగంలో సీటుపై కూర్చున్న యువతులకు కాళ్లువిరిగాయి. వీరిని చికిత్స నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు.