ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, పొరపాట్లు దొర్లకుండా సమర్థ బందోబస్తు విధులు చేపట్టాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి శనివారం బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే హోంగార్డుల నుండి ఉన్నతాధికారులతో నేమకల్లులో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు.