రాయదుర్గం పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో అన్నిపార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఏజెంట్లతో ఆర్వో కరుణకుమారి శనివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ చిట్టిబాబు, కమిషనర్ కిషోర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ప్రశాంత ఎన్నికల కౌంటింగ్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పమన్నారు.