రాయదుర్గం: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం భారీఎత్తున ప్రచారర్యాలీ నిర్వహించారు. శాంతినగర్ జమ్మిచెట్టు నుండి వినాయక సర్కిల్ మీదుగా లక్ష్మీ బజార్ పెట్రోల్ బంక్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. బహుజనులకు రాజ్యాధికారం మా పార్టీతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గ ప్రజల నుండి తమ పార్టీకి అనూహ్యస్పందన లభిస్తోందన్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు.