నార్పల మండలం పరిధిలోని నల్లపరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుత్ ప్రమాదంలో రైతు రమణారెడ్డి మృతి చెందడం జరిగింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ ప్రమాదంలో రైతు మృతి చెందడంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్పల పోలీసులు తెలియజేశారు.